- తెలంగాణ మణిహారం ఫార్మాసిటీకి గ్రీన్ సిగ్నల్…
- కేంద్రం నుంచి కొట్లాడి సాధించిన తెలంగాణ ప్రభుత్వం…
- సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో బంగారు తెలంగాణ కోసం కొనసాగుతున్న యత్నాలు…
- ఫార్మాసిటీ రాకతో దేశంలో పారిశ్రామికీకరణలో తెలంగాణ నెంబర్వన్గా అవ్వడం ఖాయం….
తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన కృషి క్రమక్రమంగా ఫలిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టాలన్న ఫార్మాసిటీకి అనుమతి లభించింది. దీంతో తెలంగాణ మరింత వేగంగా అభివృద్ధి చెందిన ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ శివార్లలో రానున్న ఫార్మాసిటీ తో తెలంగాణ దేశవ్యాప్తంగా ప్రత్యేకతను సంతరించుకోనుంది. నగరం మధ్యలో ఉన్న ఫార్మా కంపెనీలను ఎత్తివేసి శివారులో కి తరలించి అక్కడ ఫార్మాసిటీ ని ప్రభుత్వం నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో ఫార్మా సిటీ లో అన్ని ఫార్మా కంపెనీలు కొలువుదీరి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫార్మా రంగానికి ఊతం ఇచ్చేలా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఎంపీల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఫార్మాసిటీ సాధనకు ఎట్టకేలకు సాధించిన అని విశ్లేషకులు కొనియాడుతున్నారు.
రాష్ట్రానికి ప్రత్యేకమైన ఫార్మాసిటీ వల్ల పెట్టుబడులు అనూహ్యంగా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫార్మాసిటీ అనుమతులు సాధించడమే కాకుండా వందల కోట్ల రూపాయలు సాయంగా రాష్ట్రం పొందనుంది. తొలివిడతలో 1500 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేయనుంది. దీంతో ఫార్మాసిటీ పనులను రాష్ట్రం వేగవంతం చేయనుంది. విడుతల వారీగా నిధులను కేంద్రం నుంచి నిధులు తేవాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఫార్మా రంగంలో తెలంగాణాలోని అనేక దిగ్గజ కంపెనీలు నెలకొని ఉన్నాయి. తాజా ఫార్మాసిటీ రాకతో తెలంగాణ రాష్ట్రం ఫార్మ్ హబ్ గా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణను బంగారుమయం గా చేసేందుకు సీఎం కేసీఆర్ ఒక అడుగు గట్టిగా వేస్తున్నారని ప్రశంసిస్తున్నారు. ఫార్మాసిటీ రాకతో పెట్టుబడులు బారీగా రావడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు మరింత గణనీయంగా పెరగడం ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాబోయే ఫార్మాసిటీతో తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూలంగా రాష్ట్రానికి ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే సింగిల్విండో అనుమతులను మంజూరు చేస్తూ అందరికి ఆదర్శప్రాయంగా నిలిచిన తెలంగాణ మరిన్ని అదనపు ఆకర్షణలు మిగిలి ఉందని తెలుస్తోంది. దీంతో పారిశ్రామికీకరణ లో తెలంగాణ దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా పార్క్.. దేశంలోని ఫార్మా రంగానికి ఈ పార్క్ దోహదం చేస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా ఫార్మాసిటీని గుర్తించింది. దీంతోపాటు జాతీయ పెట్టుబడి, తయారీ జోన్ (NIMZ) గా సూత్రప్రాయంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫార్మా సిటీకి దేశీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల నుంచి మంచి స్పందన లభిస్తోందని, హైదరాబాద్ ఫార్మా సిటీ లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమ స్ఫూర్తి మేరకు హైదరాబాద్ ఫార్మాసిటీ అంతర్జాతీయ ఫార్మా రంగంలో భారతదేశం లీడర్ పొజిషన్ మరింత బలోపేతం చేస్తుందని, దేశీయ ఫార్మా తయారీ రంగానికి కీలకం అవుతుందని విశ్లేషకులు తెలిపారు. హైదరాబాద్ ఫార్మాసిటీ జీరో లిక్విడ్ డిస్చార్జ్ (శూన్య ద్రవ వ్యర్దాల) పద్ధతిలో కాలుష్య రహితంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్నట్లు నిపుణులు అంటున్నారు. ఫార్మాసిటీ ప్రాజెక్టులో భాగంగా అంతర్జాతీయ స్థాయి ఫార్మా యూనివర్సిటీ, లాజిస్టిక్స్ పార్క్, ఫార్మా ట్రైయినింగ్, టెస్టింగ్ పరిశోధనాశాలలు, కామన్ డ్రగ్ డెవలప్మెంట్ సెంటర్ వంటి సౌకర్యాలతో పాటు ఫార్మా రంగంలోని స్టార్టప్లకు ప్రత్యేక హబ్ ఏర్పాటు కానుందని తెలిపారు. ఇప్పటికే మొత్తం 19,333 ఎకరాలకు మాస్టర్ ప్లాన్ పూర్తయిందని మొదటి దశలో భాగంగా 8,400 ఎకరాలకు డిటైల్డ్ డిజైన్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు కూడా ఇచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటుచేసి మొదటి దశ పనులను ప్రారంభించింది.
ఫార్మాసిటీ ద్వారా సుమారు 64000 కోట్ల రూపాయల పెట్టుబడులకు అవకాశం ఉన్నదని, ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 5 లక్షల 60 వేల మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉన్నది. ఇంత విశేష ప్రాధాన్యం ఉన్న ఫార్మాసిటీకి నిమ్జ్ పాలసీ మార్గదర్శకాల మేరకు బహిరంగ మౌలిక వసతుల కల్పన కోసం 1318 కోట్ల రూపాయల గ్రాంట్ ఇన్ ఏయిడ్ అందించాలని గతంలో ప్రభుత్వం కోరింది. దీంతోపాటు అంతర్గత మౌలిక వసతుల కల్పన, కామన్ ఎప్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి సాంకేతిక మౌళిక వసతుల సదుపాయాల కోసం మరో 50 శాతం ఖర్చు (సూమారు 2100)కోట్ల సహాయం అందించాలని కోరింది.
ఫార్మా సిటీలో ఏర్పాటు చేయనున్న కంపెనీల ఇంధన అవసరాలకోసం సహజవాయువును ప్రిఫరెన్సియల్ టారిఫ్ ప్రాతిపదికన కేటాయించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని రాష్ట్రం కోరింది. ప్రస్తుతం ఫార్మా కంపెనీలు బొగ్గును ఇంధనంగా వాడుతున్నాయని, అయితే గ్రీన్ ఇండస్ట్రియల్ కాన్సెప్ట్ (కాలుష్య రహిత పద్ధతిన) ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ కోసం సహజ వాయువు వాడాల్సి ఉంటుందని, అయితే ప్రస్తుతం ఉన్న పద్ధతితో పోల్చుకుంటే ఇది కొంత ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో ఫార్మారంగానికి ఉంచుకొని తక్కువ ధరకు సహజ వాయువు సరఫరా చేయాల్సిందిగా కేంద్రం కోరింది. ఏదేమైనా తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ మార్గదర్శకంలో రాష్ట్రం త్వరలోనే బంగారుమయంగా కానుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.